విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి
ABN, First Publish Date - 2022-01-20T04:40:36+05:30
రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని టీఎన్ఎ్సఎ్ఫ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివసాయిరెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
బద్వేలు, జనవరి 19: రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని టీఎన్ఎ్సఎ్ఫ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివసాయిరెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని కళాశాలలు, ప్రభు త్వ పాఠశాలలను సందర్శించి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నా రు. 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇంకా రాలేదని, థర్డ్వేవ్ ప్రమా దం పొంచి ఉన్న నేపథ్యంలో పాఠశాల, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్ఎ్సఎ్ఫ నేతలు శ్రీకాంత్, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T04:40:36+05:30 IST