ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా నారా లోకేశ్‌ పుట్టిన రోజు వేడుకలు

ABN, First Publish Date - 2022-01-24T04:57:26+05:30

లుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు ఆదివారం రాయచోటిలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు.

పేదలకు అన్నదానం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి / లక్కిరెడ్డిపల్లె, వీరబల్లి, జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు ఆదివారం రాయచోటిలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రమే్‌షకుమార్‌రెడ్డి కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే పాల కొండ్రాయుడు కార్యాలయంలో టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో... స్థానిక మండిపల్లె భవన్‌లో మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌వలి, తెలుగుయువత అధ్యక్షుడు జాబీర్‌ ఆధ్వర్యంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే లక్కిరెడ్డిపల్లెలోని ఆర్‌ఆర్‌ స్వగృహంలో ఆదివారం  నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.  వీరబల్లిలో నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను టీడీపీ నేత చమర్తి జగన్‌ మోహన్‌రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభి మానులతో కలిసి కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. 

 

రైల్వేకోడూరులో....: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు ఆధ్వ ర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్‌ను కట్‌ చేసి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచి పెట్టారు.  కార్యక్రమం లో రైల్వేకోడూరు టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మా శివ, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కమతం నాగరాజు యాదవ్‌, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని వీపీఆర్‌ కండ్రిక పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ ఆశ్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకుడు బొక్కసం సునీల్‌ పేదలకు అన్నదానం చేశారు.  

Updated Date - 2022-01-24T04:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising