ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముమ్మరంగా టీడీపీ సభ్యత్వ నమోదు

ABN, First Publish Date - 2022-09-25T05:14:00+05:30

టీడీపీకి కంచుకోటగా ఉన్న రామస ముద్రం మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు ముమ్మరంగా సాగుతోంది.

మాలేనత్తంగ్రామంలో టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామసముద్రం, సెప్టెంబరు 24: టీడీపీకి కంచుకోటగా ఉన్న రామస ముద్రం మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు ముమ్మరంగా సాగుతోంది. పార్టీ ఆదేశాల మేరకు నాలుగు నెల లుగా పార్టీశ్రేణులు చేపట్టిన ఈకార్య క్రమానికి ప్రజల నుంచి విశేషస్పం దన లభిస్తోంది. ముఖ్యంగా విద్యావంతు లైన యువత, మహిళలు ఉత్సాహం చూపుతున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ఇందులోభాగంగా ఇప్పటి వరకూ 4,500 మంది పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీనేతలు విజయ్‌కుమార్‌గౌడ్‌, కొండూరు నారాయణరెడ్డి, ప్రశాంత్‌, సుధాకర్‌రెడ్డి, రాజేష్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన మూడేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీ లకు ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు.  దీంతో ప్రజలంతా టీడీపీవైపునకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ నేత శ్రీరాం తన టీమ్‌ సభ్యులు వెంకటేష్‌, అశోక్‌, శ్రీనాథ్‌లతో కలసి సభ్యత్వాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.


Updated Date - 2022-09-25T05:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising