కంటైనర్, బైకు ఢీ - ఒకరి దుర్మరణం
ABN, First Publish Date - 2022-06-26T04:42:14+05:30
రామాపురం చెక్పోస్టు వద్ద కం టైనర్ - బైకు ఢీకొన్న ఘటనలో గుండ్లూ రు వాసి సుబ్బారెడ్డి (48) దుర్మరణం చెందాడు.
రాజంపేటటౌన్, జూ న్ 25: రామాపురం చెక్పోస్టు వద్ద కం టైనర్ - బైకు ఢీకొన్న ఘటనలో గుండ్లూ రు వాసి సుబ్బారెడ్డి (48) దుర్మరణం చెందాడు. వివరాల్లో కెళ్తే.. సుబ్బారెడ్డి ప ని నిమిత్తం రాజంపే టకు వచ్చి పనిము గించుకుని తిరిగి బైకులో స్వగ్రామాని కి వెళుతూ రామా పురం చెక్పోస్టు వద్ద కడప నుంచి తిరుపతి వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కంటైనర్ సుబ్బారెడ్డి తలపై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ భక్తవత్సలం ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2022-06-26T04:42:14+05:30 IST