డివిజన్లో పర్యటించిన సెంట్రల్ సర్వే అధికారులు
ABN, First Publish Date - 2022-05-18T05:01:47+05:30
డివిజన్ కేంద్రంలో మంగళవారం విజయవాడ నుంచి సెంట్రల్ సర్వే కార్యాలయ అధికారి శ్రీనివాసులరెడ్డి, వారి బృందం పర్యటించారు.
జమ్మలమడుగు రూరల్, మే 17: డివిజన్ కేంద్రంలో మంగళవారం విజయవాడ నుంచి సెంట్రల్ సర్వే కార్యాలయ అధికారి శ్రీనివాసులరెడ్డి, వారి బృందం పర్యటించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి, సభాభవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో జమ్మలమడుగులోని సర్వే అధికారులు, సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో సమావేశమై సూచనలు, సలహాలు ఇచ్చారు. రికార్డులు తనిఖీ చేశా రు.
డివిజన్లో స్పందనకు వచ్చిన వినతులు పరిశీలించినట్లు వారు తెలిపారు. అనంతరం రీసర్వే రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమం లో సెంట్రల్ సర్వే అధికారులు ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో కడప సర్వే ఏడీ కనకప్రసాదు, డీఐఓఎస్ అధికారులు గురివిరెడ్డి, మల్లికార్జున నాయుడు, సీనియర్ సర్వేయర్లు హరి, ప్రసన్న, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం సచివాలయాలకు సంబంచిన సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-05-18T05:01:47+05:30 IST