పశువులకు టీకాలు వేయించాలి
ABN, First Publish Date - 2022-10-09T04:34:45+05:30
గొర్రెలు, మేకలు తదితర పశువులకు జబ్బులు రాకుం డా సకాలంలో టీకాలు వే యించాలని కలసపాడు పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు.
కలసపాడు, అక్టోబరు 8 : గొర్రెలు, మేకలు తదితర పశువులకు జబ్బులు రాకుం డా సకాలంలో టీకాలు వే యించాలని కలసపాడు పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం పశు విజ్ఞాన బడి కార్యక్రమానికి సంబంధించి కలసపాడు మండలంలో పాడి పశువుల, లాభసాటి గొర్రెల, మేకల పెంపకందారులకు పశువైద్యాధికారి సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు తెల్లగోర్ల సురే్షయాదవ్, ఉపాధ్యక్షుడు రమణయ్య, రెడ్డిపల్లె యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, గోపాలమిత్ర కె.అంకిరెడ్డి, గొర్రెల పెంపకందార్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-09T04:34:45+05:30 IST