ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి
ABN, First Publish Date - 2022-12-06T23:36:52+05:30
మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు, కాలేజీల్లో ఉన్న విద్యార్థులు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దారు సుబాని కోరారు.
చాపాడు, డిసెంబరు 6: మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు, కాలేజీల్లో ఉన్న విద్యార్థులు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దారు సుబాని కోరారు. సీబీఐటీ కాలేజీలో మంగళవారం ఓటు హక్కు నమోదుపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు అర్హులన్నారు. దరఖాస్తు ఫారాలను ఆన్లైన్, తహసీల్దారు, బీఎల్వోలకు ఇవ్వాలని కోరారు. ఎవరివైనా ఓట్లు తొలగించి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐ ప్రవీణ్, విద్యార్థులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-12-06T23:37:09+05:30 IST