ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulsi Reddy: హోదా లేదు.. పోలవరం కాదని కేంద్రం చెప్పడం సరికాదు...

ABN, First Publish Date - 2022-12-13T12:17:34+05:30

కడప జిల్లా: ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, రాష్ట్రానికి సంజీవని అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా: ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, రాష్ట్రానికి సంజీవని అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హోదా లేదు.. పోలవరం కాదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. విభజన చట్టం ప్రకారం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. హోదా అమలు, పోలవరం పూర్తి కాంగ్రెస్‌తోనే సాధ్యమని తులసిరెడ్డి పేర్కొన్నారు.

2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తులసిరెడ్డి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి భగవంతుడు ప్రసాదించిన వరమని, విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయికట్టు, 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణ, 540 గ్రామాలకు త్రాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం తదితర ప్రయోజనాలు ఉన్నాయని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-13T12:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising