జాతీయ జెండాకు అవమానం
ABN, First Publish Date - 2022-08-14T05:13:17+05:30
దేశమంతటా 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఓ పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది.
దువ్వూరు, ఆగస్టు 13: దేశమంతటా 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఓ పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఇడమడక మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలపై జాతీయ జెండాను తిరగేసి ఎగరేశారు. ఇడమడక ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యా యులు జాతీయ జెండాను కాషాయం రంగు కిందికి, ఆకుపచ్చ రంగు పైకి వచ్చే విధంగా ఎగురవేశారు. శనివారం మధ్యా హ్నం దీనిని ఫొటో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో సాయంత్రం 6గంటల తర్వాత జాతీయ జెండాను దించి మామూలుగా ఎగురవేశారు.
Updated Date - 2022-08-14T05:13:17+05:30 IST