వైభవంగా అగస్త్యేశ్వరస్వామి రథోత్సవం
ABN, First Publish Date - 2022-05-17T05:09:27+05:30
అగస్త్యేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
ప్రొద్దుటూరు టౌన్, మే 16 : అగస్త్యేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరిదేవి అమ్మవార్లకు విశేష పూజలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. పూజల అనంతరం గంగాగౌరి సమేత అగస్త్యేశ్వరస్వామిని సుందరంగా అలంకరించి రథంపై ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా దారి వెంట భక్తులు స్వామికి కాయాకర్పూరం సమర్పించారు. మధ్యాహ్నం శివోహం కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్బాలాజీ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాంప్రసాద్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-17T05:09:27+05:30 IST