ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేవానంద్‌కు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-01-25T04:35:39+05:30

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేవానంద్‌కు సోమవారం జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు.

దేవానంద్‌ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, జనవరి 24 : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేవానంద్‌కు సోమవారం జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. దేవానంద్‌ కొంతకాలంగా వెన్నెముక వ్యాధితో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని మండల పరిధిలోని కనపర్తి గ్రామానికి తరలించారు. అక్కడి ఎస్టేటల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశాల మేరకు కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి దేవానంద్‌ మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య టీఎల్‌ సుజాత, కుమారుడు ప్రశాంత్‌ ఆనంద్‌, కుమార్తె దయానలను పరామర్శించారు. కాగా దేవానంద్‌ 1955 జనవరి 26న అనంతపురం జిల్లాలో జన్మించారు. కడపలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో పీజీ పూర్తి చేశారు. మొదట ఐఏఎస్‌ పంజాబ్‌ క్యాడర్‌తో ఆయన ప్రస్థానం మొదలైంది. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌బోర్డు ఎండీగా పనిచేశారు. 

Updated Date - 2022-01-25T04:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising