ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

734 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-01-23T05:18:22+05:30

జిల్లాలో కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 734 మందిలో కరోనా పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 734 మందిలో కరోనా పాజిటివ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,411కు చేరుకుంది. ఇప్పటి వరకు 715 మంది మృతి చెందారు. కోలుకున్న 308 మందిని డిశ్చార్‌ ్జ చేయగా రికవరీ సంఖ్య 1,19,510కు చేరుకుంది. ఆస్పత్రిలో 84 మంది, హోం ఐసోలేషన్‌లో 3120 మంది, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 16 మంది చికిత్స పొందుతున్నారు.


వీరబల్లి హైస్కూల్‌లో ఏడుగురికి పాజిటివ్‌

వీరబల్లి, జనవరి 22: వీరబల్లి హైస్కూల్‌లో ఏడుగురు సిబ్బందికి పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యాధికారి ప్రదీ్‌పకుమార్‌ తెలిపారు. మండలంలో మొత్తం 22 మందికి పాజిటివ్‌ నమోదు కాగా హైస్కూల్‌లో ఐదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు వంట వారు ఉన్నారు. దీంతో పాఠశాలను మూసివేసేశారన్నారు. మండల వ్యాప్తంగా వీరబల్లిలో 14, సోమవరంలో 3, ఓదివీడులో 3, గడికోటలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి సూచించారు.

Updated Date - 2022-01-23T05:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising