ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరు

ABN, First Publish Date - 2022-01-24T05:22:02+05:30

రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరానికి గాను జిల్లా పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరయ్యాయని డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సర్పంచ్‌ల గౌరవ వేతనం కింద రూ.2,64,32,400 మంజూ రైందన్నారు. ఈ నిధుల నుంచి ఒక్కొక్క సర్పంచ్‌కు నెలకు రూ.3వేల చొప్పున 12 నెలల గౌరవ వేతనాన్ని ఇస్తామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రూరల్‌), జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరానికి గాను జిల్లా పంచాయతీ శాఖకు రూ.5,35,84,240 నిధులు మంజూరయ్యాయని డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సర్పంచ్‌ల గౌరవ వేతనం కింద రూ.2,64,32,400 మంజూ రైందన్నారు. ఈ నిధుల నుంచి ఒక్కొక్క సర్పంచ్‌కు నెలకు రూ.3వేల చొప్పున 12 నెలల గౌరవ వేతనాన్ని ఇస్తామన్నారు. అలాగే వృత్తి పన్ను (గ్రామాలలో పలు శాఖలలో పనిచేసే ఉద్యోగుల ద్వారా వసూలైన పన్ను) రూ.1,92,52,240లు, 4 రూపాయల తలసరి గ్రాంట్స్‌ కింద మొత్తం రూ.78,99,600 కేటాయించారన్నారు. ఈ నిధులన్నింటిని జనరల్‌ ఫండ్‌కు జమచేసి అక్కడి నుంచి జిల్లాలోని 807 గ్రామ పంచాయతీలకు దామాషా ప్రకారం కేటాయిస్తామన్నారు. ఈ నిధులను ఆయా గ్రామ పంచాయతీలలో శానిటేషన్‌, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కరెంట్‌ బిల్లుల చెల్లింపులకు ఉపయోగిస్తారన్నారు.

Updated Date - 2022-01-24T05:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising