కడప జిల్లా నేతల్లో సమన్వయ లోపం ఉంది: చంద్రబాబు
ABN, First Publish Date - 2022-02-18T01:12:30+05:30
కడప జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమీక్ష ముగిసింది. కడప జిల్లా నేతల్లో సమన్వయ లోపం ఉందని
అమరావతి: కడప జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమీక్ష ముగిసింది. కడప జిల్లా నేతల్లో సమన్వయ లోపం ఉందని, ఇక నుండి కడప జిల్లా నేతలంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి నెలా జిల్లా నేతలు సమావేశమై స్థానిక అంశాలపై చర్చించి పోరాడాలని పిలుపునిచ్చారు. మాజీమంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ వైసీపీ నేతలను దోషిగా తేల్చిందన్నారు. కడప జిల్లా ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించారని చంద్రబాబు సూచించారు.
Updated Date - 2022-02-18T01:12:30+05:30 IST