జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలి: చంద్రబాబు
ABN, First Publish Date - 2022-03-11T23:51:49+05:30
జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
అమరావతి: జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మరణాలతో భయాందోళనలో స్థానిక ప్రజలున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత లేని ఆహారంతో వల్లే విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.
Updated Date - 2022-03-11T23:51:49+05:30 IST