సీబీఐ దత్తపుత్రుడికి మనసెలా వస్తోంది: Nadendla Manohar
ABN, First Publish Date - 2022-05-20T00:02:31+05:30
రైతులను దోచుకోవడానికి సీబీఐ దత్తపుత్రుడికి మనసెలా వస్తోందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసమే ఉన్నాయా?..
Amaravathi: రైతులను దోచుకోవడానికి సీబీఐ దత్తపుత్రుడికి మనసెలా వస్తోందని జనసేన పార్టీ (Janasena Party) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసమే ఉన్నాయా? అని నిలదీశారు. మిల్లర్ల చేతిలో పౌరసరఫరాల శాఖ కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జనసేన పోరాడుతుందన్నారు. కర్షకులు కన్నీరు పెడుతున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
Updated Date - 2022-05-20T00:02:31+05:30 IST