ఆర్థివేత్త థామస్ సోవెల్ ట్వీట్పై పవన్ స్పందన
ABN, First Publish Date - 2022-04-14T13:42:40+05:30
ఆర్థికవేత్త 'థామస్ సోవెల్' ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమరావతి: ఆర్థికవేత్త 'థామస్ సోవెల్' ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ ద్రవ్యోల్బణంపై థామస్ సోవెల్ చేసిన ట్వీట్ చదవగానే...ఆర్థిక సమస్యలతో మునిగిపోయిన సగటు మనిషి గురించి రాసిన శేషేంద్ర కవితా పంక్తులు గుర్తొచ్చాయి..!’’ అని అన్నారు.
"వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి
చెట్టుగా వుంటే ఏడాదికికి ఒక వసంతమన్నా దక్కేది
మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను" అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Updated Date - 2022-04-14T13:42:40+05:30 IST