ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు రైతులకు వైసీపీ సరైన న్యాయం చేయడం లేదు: Nadendla

ABN, First Publish Date - 2022-07-14T17:51:02+05:30

కౌలు రైతులకు వైసీపీ సరైన న్యాయం చేయడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: కౌలు రైతులకు వైసీపీ(YCP) సరైన న్యాయం చేయడం లేదని జనసేన(Janasena) నేత నాదెండ్ల మనోహర్(Nadendla manohar) విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కౌలు రైతుల ఆత్మహత్యలపై వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారన్నారు. రైతుల కష్టాలపై సరైన తీరులో ముఖ్యమంత్రి స్పందించడం లేదని ప్రజలకు అర్ధమైందని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు రైతులే కాదని వారిని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిది వందల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సర్కార్ అంగీకరించిందని...వారందరికీ  ఏడు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈనెల 16న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మండపేట చేరుకుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 16న పవన్ కళ్యాణ్ సభకు రాకుండా పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ  హయాంలో 3 వేల మంది చనిపోతే... కేవలం 800 మంది చనిపోయారు అని వైసీపీ నాయకులు చెప్పడం దారుణమని నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Updated Date - 2022-07-14T17:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising