సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఘటన దురదృష్టకరం: Pawan
ABN, First Publish Date - 2022-06-17T20:44:59+05:30
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి/హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-06-17T20:44:59+05:30 IST