ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ చేరిన జగన్‌

ABN, First Publish Date - 2022-08-22T08:33:44+05:30

ఢిల్లీ చేరిన జగన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ప్రధానితో భేటీ

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అమిత్‌ షాలతో భేటీ అయ్యే అవకాశం


న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఆ సందర్భంగా ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. పై సమావేశం అనంతరం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను కలిసే ప్రయత్నం చేస్తారని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జగన్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. 

Updated Date - 2022-08-22T08:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising