ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ అసమర్థత, అవినీతి పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి: దేవినేని

ABN, First Publish Date - 2022-04-22T23:39:39+05:30

జగన్ అసమర్థత, అవినీతి, పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ అసమర్థత, అవినీతి, పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్వాసితులకు లక్షలు ఇస్తానంటూ జగన్ బీరాలు పలికారని మండిపడ్డారు. ఎస్టీ సీట్లన్నీ తానే గెలిచానన్న అహంతో నిర్వాసితులను నట్టేట ముంచారని, నిర్వాసితులకే న్యాయం చేయలేని జగన్ పోలవరం పూర్తి చేస్తారా? అని దేవినేని ప్రశ్నించారు. కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరాన్ని ఎప్పట్లోగా పూర్తిచేస్తారో జగన్ చెప్పాలని నిలదీశారు. ప్రాజెక్ట్‌లో పడిన గుంతలు పూడ్చటానికి రూ.800కోట్లు, నీళ్లు ఎత్తిపోయడానికి రూ.2 వేల కోట్లు అవుతుందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రానికి లేఖ రాస్తానని దేవినేని ఉమా తెలిపారు.

Updated Date - 2022-04-22T23:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising