ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం: పీతల సుజాత

ABN, First Publish Date - 2022-07-06T22:38:08+05:30

ఎం జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతోందనని టీడీపీ నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: సీఎం జగన్ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతోందని టీడీపీ నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి, విద్యాదీవెన పథకాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుని వారిని ఫెయిల్ చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సమకూర్చని ప్రభుత్వం.. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచే విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఎందుకు? అని ప్రశ్నించారు. పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల విద్యార్థులు 5 కిలోమీటర్లు నుండి 10 కిలోమీటర్లు చదువు కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులపై నిజంగా జగన్‌కు ప్రేమ ఉంటే కార్పొరేట్ తరహాలో ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-06T22:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising