కోవిడ్ వ్యాక్సిన్పై కేంద్రానికి జగన్ లేఖ
ABN, First Publish Date - 2022-01-17T23:44:13+05:30
కోవిడ్ 'ప్రికాషనరీ' డోస్ తీసుకునేందుకు నిర్ధారించిన 9 నెలల గ్యాప్ను 6 నెలలకు తగ్గించాల్సిందిగా..
అమరావతి: కోవిడ్ 'ప్రికాషనరీ' డోస్ తీసుకునేందుకు నిర్ధారించిన 9 నెలల గ్యాప్ను 6 నెలలకు తగ్గించాల్సిందిగా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సోమవారం జరిపిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి అర్హులైన హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి 'ప్రికాషన్ డోస్' ఇస్తున్నారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, తొమ్మిది నెలల గ్యాప్ ఉంటేనే ప్రికాషనరీ డోస్ ఇస్తారు. రెండవ డోసులో ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటారో ప్రికాషనరీ డోసుగా అదే వ్యాక్సిన్ను ఇస్తారు.
Updated Date - 2022-01-17T23:44:13+05:30 IST