Jagan ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది: లంకా దినకర్
ABN, First Publish Date - 2022-05-22T17:59:21+05:30
పెట్రోల్, డీజిల్పై ఏపీ సర్కార్ ఎంత వ్యాట్ తగ్గిస్తుందో చెప్పాలని బీజేపీ నేత దినకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: పెట్రోల్, డీజిల్పై ఏపీ సర్కార్ ఎంత వ్యాట్ తగ్గిస్తుందో చెప్పాలని బీజేపీ నేత దినకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కేంద్రం రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. జగన్ ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని తప్పుబట్టారు. ప్రజలపై ధరల భారం తగ్గించే బాధ్యత ఏపీ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ముందుకురాదా అని దినకర్ నిలదీశారు.
Updated Date - 2022-05-22T17:59:21+05:30 IST