AP News: రేపు ఢిల్లీకి జగన్, చంద్రబాబు
ABN, First Publish Date - 2022-08-06T00:06:45+05:30
శనివారం సీఎం జగన్ (Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. చంద్రబాబు (Chandrababu) పాల్గొనబోయే
అమరావతి: శనివారం సీఎం జగన్ (Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. చంద్రబాబు (Chandrababu) పాల్గొనబోయే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి జగన్ వెళ్లడం లేదు. ఇద్దరూ ఒకే రోజు ఢిల్లీకి వెళ్లడం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో చంద్రబాబు భేటీ అవుతారు. సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధాని నేతృత్వంలో జరిగే.. ఆజాదీకా మహోత్సవ్ కమిటీ భేటీలో పాల్గొననున్నారు. రేపు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీకి జగన్ చేరుకుంటారు. 7న రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ నిర్వహించే.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.
Updated Date - 2022-08-06T00:06:45+05:30 IST