AP News: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే.. జవహర్
ABN, First Publish Date - 2022-08-06T16:24:25+05:30
Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ(YSRCP)పై దాడిని తీవ్రం చేశాయి. సోషల్
Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ(YSRCP)పై దాడిని తీవ్రం చేశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు నాయకులు ఆ పార్టీని తూర్పార బడుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి జవహర్ (Ex minister Jawahar) మాట్లాడుతూ.. ‘‘జగన్ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి పబ్జి ఆడుకుంటుంటే.. మంత్రులు మహిళలను గంటల లెక్కన వేధిస్తున్నారు. రాష్ట్రంలో కీచక పాలన సాగుతోంది. మర్డర్లు, మానభంగాలు సర్వసాధారణం అయ్యాయి. జగన్ బలహీనతలు వైసీపీ నాయకులను నియంత్రించలేకపోతున్నాయి. ఇక రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలదే’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2022-08-06T16:24:25+05:30 IST