ముక్కంటి సేవలో ఇస్రో చైర్మన్
ABN, First Publish Date - 2022-01-09T01:31:29+05:30
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని శనివారం ఇస్రో చైర్మన్ కె.శివన్, కర్ణాటక కస్టమ్స్
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని శనివారం ఇస్రో చైర్మన్ కె.శివన్, కర్ణాటక కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ దర్శించుకున్నారు. శివన్ కుటుంబ సభ్యులు రూ.5వేల రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
Updated Date - 2022-01-09T01:31:29+05:30 IST