విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్
ABN, First Publish Date - 2022-06-15T08:21:41+05:30
విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్
వెయ్యి మందితో కార్యకలాపాలు
డిసెంబరులోగా ఏర్పాటుకు అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మూడేళ్ల తరువాత విశాఖపట్నానికి మరో కొత్త ఐటీ కంపెనీ వస్తోంది. ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానే ఇక్కడ ఓ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ముందుకువచ్చింది. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వచ్చినవారే తమ వద్ద పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారని, అందుకే ఆ నగరాలపైనే దృష్టి కేంద్రీకరించామని కంపెనీ హెచ్ఆర్ విభాగం హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెన్నైలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబరుతో ముగిసే క్వార్టర్ నాటికి నాలుగు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇన్ఫోసిస్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తోంది. అందులో విశాఖపట్నం ఒకటి. ఒక్కో సెంటర్ను వెయ్యి సీటర్లతో ప్రారంభిస్తారు. వీటిని టాలెంట్ పూల్ హబ్లుగా అభివృద్ధి చేస్తారు. దశల వారీగా పెట్టుబడులు పెంచి, విస్తరిస్తారు. సిబ్బందికి అవసరమైన నైపుణ్యం కోసం స్కిల్ డెవల్పమెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు.
Updated Date - 2022-06-15T08:21:41+05:30 IST