cm jagan: ఇంద్రకీలాద్రికి జగన్... భక్తులకు ఆంక్షలు
ABN, First Publish Date - 2022-10-02T21:26:56+05:30
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఆదివారం
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఆదివారం సీఎం జగన్ (cm jagan) పట్టువస్త్రాలు సమర్పించారు. మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మను ఆయన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు దర్శించుకున్నారు. జగన్ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు విధించారు. ఆ సమయంలో అన్ని క్యూల్లో భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఆదివారం కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం. సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరే అమ్మ దర్శనానికి తెల్లవారుజామున రెండు గంటల నుంచే అనుమతించారు. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల వరకు ఈ దర్శనం ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. దాదాపు 2లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారన్న లెక్క తేల్చడం కోసం ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గాల్లో కౌంటింగ్ సెన్సార్లు ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-10-02T21:26:56+05:30 IST