ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఉన్నాయో.. లేవో కేటీఆర్ వచ్చి చూడాలి: మంత్రి అమర్నాథ్
ABN, First Publish Date - 2022-04-29T22:06:20+05:30
ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఉన్నాయో.. లేవో కేటీఆర్ వచ్చి చూడాలి: మంత్రి అమర్నాథ్
అమరావతి: ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఉన్నాయో.. లేవో తెలంగాణ మంత్రి కేటీఆర్ వచ్చి చూడాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఏపీలో కరెంట్ కోతలు తాత్కాలిక సమస్య అని మంత్రి తెలిపారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఒక్క నగరం అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం బాగుపడినట్లు కాదని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు.
Updated Date - 2022-04-29T22:06:20+05:30 IST