ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏమైనా ఉంటే నేనే చెబుతాను: బ్రదర్ అనిల్

ABN, First Publish Date - 2022-03-07T23:38:21+05:30

జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్  అన్నారు. నగరంలో వివిధ సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వాళ్ల అభిప్రాయాలు చెప్పారన్నారు. మీడియాలో మాత్రం వేరే విధంగా వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతామనేది అసత్య ప్రచారమన్నారు. ఉండవల్లిని కలిసిన అంశం వేరన్నారు. ఏమైనా ఉంటే ఆ వివరాలను తానే చెబుతానని ఆయన పేర్కొన్నారు. 


రాష్ట్రంలోని వివిధ సంఘాలతో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం దాదాపు  రెండు గంటలపాటు సాగింది. త్వరలో కొత్త  పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్‌ అనిల్ ఉన్నాడని  ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్‌ అనిల్ మంతనాలు జరిపారు.  రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బ్రదర్ అనిల్ ఖండించారు. ఇప్పుడు అటువంటి ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంశం మొత్తం ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే.. తాను మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-07T23:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising