రఘురామపై ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు స్టే
ABN, First Publish Date - 2022-02-14T20:40:45+05:30
ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో తదనంతర చర్యలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో తదనంతర చర్యలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీలను రఘురామ దూషించారంటూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పీఎస్లో కేసు నమోదు చేశారు. సీఐడీ డీజీ సునీల్కుమార్ బంధువు తనపై కేసు నమోదు చేశారంటూ.. రఘురామ తరపు లాయర్ వెంకటేష్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ ఎలాంటి దూషణలు చేయకపోయినా కేసు నమోదు చేశారని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Updated Date - 2022-02-14T20:40:45+05:30 IST