సౌమ్యనాథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN, First Publish Date - 2022-10-05T08:40:24+05:30
సౌమ్యనాథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
నందలూరు, అక్టోబరు 4: అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ సౌమిత్రి పూర్ణకుంభంతో న్యాయమూర్తికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2022-10-05T08:40:24+05:30 IST