మనసున్న నేత గౌతమ్రెడ్డి
ABN, First Publish Date - 2022-02-22T00:59:32+05:30
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో సర్వత్రా దిగ్ర్భాంతి నెలకుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు.
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో సర్వత్రా దిగ్ర్భాంతి నెలకుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. అజాత శత్రువుగా, అందరివాడిగా, మనసున్న మంచి మనిషిగా పేరు గడించిన మేకపాటి గౌతమ్రెడ్డి ఇకలేరు.. తిరిగిరాడు.. అని తలుచుకుని ఆవేదనకు లోనయ్యారు. గౌతంరెడ్డి మానవీయ విలువలు కలిగిన నేతగా ప్రజలు భావిస్తున్నారు. మాట తీరులోనే కాకుండా ఆపద సమయంలో తనవంతు సాయం చేయడంలో గౌతంరెడ్డి ముందుండేవారు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా సాయం అందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల సంగం వద్ద ప్రమాదవశాత్తు ఒక కుటుంబం వాగులో కొట్టుకుపోతే తల్లిదండ్రులను కోల్పోయి అనాఽఽథగా మిగిలిన నవదీప్ అనే చిన్నారికి గౌతంరెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ పిల్లాడి విద్య, ఉపాధి బాఽధ్యతలు తానే చూసు కుంటానని హామీ ఇచ్చారు. ఆపదంటూ తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా ఎంతోకొంత సాయం అందించేవారు.
Updated Date - 2022-02-22T00:59:32+05:30 IST