ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వసనీయతా లేని జగన్ జనానికి ఏం చేస్తాడు: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-07-11T22:43:54+05:30

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాల్లో పలు రకాల కారణాలతో కోత పెడుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాల్లో పలు రకాల కారణాలతో కోత పెడుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. 


విశ్వసనీయత అంటే ఇదేనా? 

‘‘అమ్మను గెంటేసినవాడు..ప్రజలకేం చేస్తాడు? జగన్‌ మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు. మద్య నిషేధం, సీపీఎస్, అమరావతిపై..మాట తప్పి మడమ తిప్పడం విశ్వసనీయతా? బాబాయిపై గొడ్డలివేటు వేసిన నేరస్తుల్ని కాపాడటం విశ్వసనీయతా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 


ప్రజా సంక్షేమానికి టీడీపీ హయాంలోనే ఎక్కువ నిధులు  

వైసీపీ ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ను ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందుకే ఆయనకు భయం పట్టుకుందన్నారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి జగన్ కన్నా టీడీపీ హయాంలోనే సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేశామని వివరించారు. ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 51 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.  

Updated Date - 2022-07-11T22:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising