టీడీపీలోకి గుదిబండి గోవర్ధనరెడ్డి
ABN, First Publish Date - 2022-08-20T05:57:34+05:30
తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ గుదిబండి గోవర్ధనరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు.
కొల్లిపర, ఆగస్టు 19: తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ గుదిబండి గోవర్ధనరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. శుక్రవారం కొల్లిపర నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి వంగా సాంబిరెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి కంచర్ల అమృతరాజు, టీడీపీ నాయకులు ఆరిమండ రాధాకృష్ణారెడ్డి, భీమవరపు వేణుగోపాల్రెడ్డి, వుయ్యూరు శ్రీనివాసరెడ్డి, బొంతు చంద్రిక, వుయ్యూరు వెంకటరెడ్డి, ఆరే శేఖర్, షేక్ రఫీ, దాసరి నరసయ్య, దొంతగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-20T05:57:34+05:30 IST