AP News: సీఎం జగన్కు నారా లోకేష్ లేఖ
ABN, First Publish Date - 2022-10-01T00:44:41+05:30
అమరావతి: సీఎం జగన్ (CM Jagan)కు టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. గిట్టుబాటు ధరలేక సుబాబుల్ రైతులు తీవ్రనష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబాబుల్ పంట కొనుగోళ్లలో రాజకీయ జోక్యాన్ని
అమరావతి: సీఎం జగన్ (CM Jagan)కు టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. గిట్టుబాటు ధరలేక సుబాబుల్ రైతులు తీవ్రనష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబాబుల్ పంట కొనుగోళ్లలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, వివక్ష లేకుండా రైతులందరి పంటను కొనాలని డిమాండ్ చేశారు. రైతుల పంటను వైసీపీకి చెందినవారికే విక్రయించాలనే..నూతన సంస్కృతి ఏపీలో రావడం దురదృష్టకరమన్నారు. సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం చూసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంటను దళారులకు విక్రయించినా ధరలో కోత పెడుతున్నారని, పోలీసులు దళారులకు వత్తాసు పలకడం దుర్మార్గంమని మండిపడ్డారు.
Updated Date - 2022-10-01T00:44:41+05:30 IST