ఒంగోలులో సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు: నక్కా ఆనంద్బాబు
ABN, First Publish Date - 2022-04-23T20:26:33+05:30
అమరావతి: ఒంగోలులో సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారని ఆనంద్బాబు విమర్శించారు.
అమరావతి: ఒంగోలులో సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలు వద్దంటున్నాయనడం సరికాదన్నారు. జగన్రెడ్డి సంక్షేమం అంతా పచ్చిమోసమని అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ జగన్ ఎత్తేశారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని నక్కా ఆనంద్బాబు విమర్శించారు.
Updated Date - 2022-04-23T20:26:33+05:30 IST