48,632 మిర్చి టిక్కీల విక్రయం
ABN, First Publish Date - 2022-06-25T05:48:30+05:30
మిర్చియార్డుకు శుక్రవారం 45,994 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 48,632 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, జూన్ 24(ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం 45,994 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 48,632 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 5,508 టిక్కీలు నిల్వ ఉన్నాయి. శుక్రవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాలుకు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.23,000, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.22,500, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.9,500, ఏసీ కామన్ వెరైటీకి రూ.8,000, రూ.24,000, ఏసీ స్పెషల్ వెరైటీకి రూ.7,500, రూ.24,000, ఏసీ తెల్లకాయలకు రూ.6,500, రూ.8,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
Updated Date - 2022-06-25T05:48:30+05:30 IST