ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ఎక్కడా అవినీతి లేదు

ABN, First Publish Date - 2022-07-07T05:17:35+05:30

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎక్కడా అవినీతి లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అమర్‌నాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి అమర్‌నాథ్‌ 

వినుకొండటౌన్‌, జూలై 6: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎక్కడా అవినీతి లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి అమర్‌నాథ్‌ స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడేళ్ల కాలంలో రూ.1.54లక్షల కోట్లు వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశామని చెప్పారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని, ప్లీనరీలో పార్టీ విధివిధానాలు, రాబోవు రోజుల్లో పార్టీ కార్యకర్తలకు దిశనిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఎన్‌టీఆర్‌ పేరును ఉపయోగించుకునే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ పేదప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి 2024లో కూడా అధికారం చేపడతారని అన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు ఉన్నారు. 


Updated Date - 2022-07-07T05:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising