Andhra Pradesh: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే దాడులా?: నారా లోకేష్
ABN, First Publish Date - 2022-05-17T19:26:13+05:30
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి
Andhra Pradesh: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్రెడ్డి మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తోన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్శర్మ కారు ధ్వంసం చేసి, చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం దారుణమన్నారు. రౌడీ రాజకీయ నాయకులకు ఎవరూ భయపడరని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా సాయినాథ్ శర్మకి అండగా ఉంటుందన్నారు. సమావేశాల్లో జగన్రెడ్డిని చూసి జనం పారిపోతుండడంతో.. జగన్రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. వైసీసీ నాయకుల మాటలు బూటకమని ప్రజలు గుర్తిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - 2022-05-17T19:26:13+05:30 IST