ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరువానలోనూ ఉక్కు సంకల్పంతో..

ABN, First Publish Date - 2022-12-10T01:49:04+05:30

జోరుగా వర్షం పడుతున్నా ఉక్కు సంకల్పంతో మండల గ్రామం పెనుమూలి, గాంధీనగర్‌లలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొన్నారు

పెనుమూలి ఎస్సీకాలనీలో సమస్యల తెలుసుకుంటూ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమంలో లోకేశ్‌

పెనుమూలి, గాంధీనగర్‌ ప్రజల ఘనస్వాగతం

విద్యుత్‌ సరఫరా నిలిపినా ఆగని పర్యటన

వర్షం పడుతున్నా ముందుకు సాగిన లోకేశ్‌

దుగ్గిరాల, డిసెంబరు 9: జోరుగా వర్షం పడుతున్నా ఉక్కు సంకల్పంతో మండల గ్రామం పెనుమూలి, గాంధీనగర్‌లలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టారు. గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. జోరువానలోనూ ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఎస్సీ కాలనీలో బాబూజగ్జీవన్‌రామ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు, తిరుతమ్మగుడి సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి లోకేశ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్నేళ్లుగా తమకు వస్తున్న పింఛన్‌ను ఇప్పుడు రద్దుచేశారని కొందరు వృద్ధులు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ సరిగా రావడం లేదని విద్యార్థినులు, గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు నిలిపివేశారని బాధితులు పలువురు ఈ సందర్భంగా నారా లోకేశ్‌కు మొరపెట్టుకున్నారు. ప్రచారం సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచివేసినప్పటికీ లోకేశ్‌తో కలిసి కార్యకర్తలు ముందుకు సాగారు. ఎస్సీ కాలనీలోని చర్చిలోనూ, గాంధీనగర్‌ శివాలయంలోనూ, పెనుమూలి మసీదులోనూ ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, గూడూరు వెంకట్రావు, అన్నాబత్తుని జయలక్ష్మి, జవ్వాది కిరణ్‌చంద్‌, ఆరుద్ర భూలక్ష్మి, సత్యనారాయణ, ఆకుల జయసత్య, మండల తె.దే.పా అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, ఎంపీటీసీ షేక్‌ జబీన్‌, పొన్నం సాంబశివరావు, నిజాముద్దీన్‌, జలాలుద్దీన్‌, సాదిక్‌, నూరుద్దీన్‌, కరీముల్లా, సుభాని, ఎం. వైష్టవి, నందిపాటి జోగారావు, కొండపనేని చటర్జీ, కంచర్ల సుబ్రహ్మణ్యం, మద్దుకూరి శ్రీను, తోటకూర సీతారామయ్య, కల్యాణచక్రవర్తి, యేమినేని కోటేశ్వరరావు, దేవరపల్లి మహేష్‌, మన్నెం అశోక్‌, కాకాని బాబు, జస్వంత్‌, కాసరనేని కృష్ణ, అంచే రవిచంద్‌, నాయుడు సీతయ్య, నూకతోటి రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising