మూడేళ్లలో ఒక్కసారైనా నిర్వహించారా?: Ex minister Jawahar
ABN, First Publish Date - 2022-06-14T23:07:00+05:30
అమరావతి: మాజీ మంత్రి జవహర్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మాట తప్పను... మడమ తిప్పను అన్న జగన్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని
అమరావతి: మాజీ మంత్రి జవహర్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మాట తప్పను... మడమ తిప్పను అన్న జగన్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. మూడేళ్లలో డీఎస్సీ ఒక్కసారి కూడా నిర్వహించలేదన్నారు. గతంతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఈ ఉత్తీర్ణతను గుజరాత్తో పోల్చుకోవడం అవివేక మన్నారు. తక్కువ వచ్చిన వారి కంటే ఎక్కువ వచ్చిన వారితో పోల్చుకోవాలన్నారు. కొన్ని స్కూళ్లు హెడ్ మాస్టర్, పీఈటీ లేకుండా నడుస్తున్నాయన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 4,672 పోస్టులను రద్దు చేశారని, ఉపాధ్యాయ సంఘాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి జగన్పై పోరాడాలని సూచించారు.
Updated Date - 2022-06-14T23:07:00+05:30 IST