ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ను తిట్టడానికేనా మంత్రి పదవులు ఇచ్చింది?: Srinivas

ABN, First Publish Date - 2022-04-25T16:53:34+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తిట్టడం కోసమేనా కొత్తగా మంత్రి పదవులు ఇచ్చింది అని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తిట్టడం కోసమేనా కొత్తగా మంత్రి పదవులు ఇచ్చింది అని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో చించుకున్న మంత్రులు అంతా గొడ్ల సావీడికి పరిమితమయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ జీవితం అంతా ప్రపంచానికి తెలిసిందే అని, రహస్యం ఏం లేదని తెలిపారు. వైసీపీ నేతల్లాగా చీకటి బ్రతుకు తమకు లేదని విమర్శించారు. వ్యభిచార గృహాలు నడిపే వైసీపీ నేతలా మమ్మల్ని విమర్శలు చేశారు అని వ్యాఖ్యానించారు. వైజగ్‌లో మంత్రి అమరనాధ్ భూకబ్జాలపై పోరాటం చేస్తామని తెలిపారు. రైతులకు మీరు ఏం చేస్తారో చెప్పలేని దుస్థితి వచ్చిందన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే మహిళలను కించ పరుస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ మాదిరిగా ఓ కులానికి జనసేన కొమ్ముకాయదని స్పష్టంచేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మంత్రుల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజలతో తన్నులు తినే పనులు చేసుకోవద్దని శ్రీనివాస్ హితవుపలికారు. 

Updated Date - 2022-04-25T16:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising