AP News: జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు
ABN, First Publish Date - 2022-08-03T02:45:33+05:30
అమరావతి: విశాఖ రుషికొండ (Rushikonda)ను చూసేందుకు వెళ్లిన హైకోర్టు న్యాయవాది మూర్తిపై నమోదు చేసిన కేసులో హైకోర్టు(High Court) స్టే విధించింది. మూర్తి 4 రోజుల క్రితం రుషికొండను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఆయనను సెక్యూరిటీ
అమరావతి: విశాఖ రుషికొండ (Rushikonda)ను చూసేందుకు వెళ్లిన హైకోర్టు న్యాయవాది మూర్తిపై నమోదు చేసిన కేసులో హైకోర్టు(High Court) స్టే విధించింది. మూర్తి 4 రోజుల క్రితం రుషికొండను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడుకున్నారు. మూర్తితో పాటు ఆయన వెంట వెళ్లిన 30 మంది జర్నలిస్టులపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. దీంతో మూర్తి కోర్టును ఆశ్రయించారు. మూర్తిపై తదనంతర చర్యలను నిలిపివేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Updated Date - 2022-08-03T02:45:33+05:30 IST