నీళ్ల ట్యాంక్ ఎక్కిన సర్పంచ్ భర్త
ABN, First Publish Date - 2022-05-30T21:39:29+05:30
Guntur: తనపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని చుండూరు మండలం ఆలపాడు సర్పంచ్ భర్త గద్దె బోడయ్య ఆరోపించారు. పోలీసుల తీరుకు
Guntur: తనపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని చుండూరు మండలం ఆలపాడు సర్పంచ్ భర్త గద్దె బోడయ్య ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా బోడయ్య నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని, తాము జనసేన పార్టీ నుంచి సర్పంచ్గా ఎన్నికవ్వడంతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించే వరకు ట్యాంక్పైనే ఉంటానని చెప్పారు.
Updated Date - 2022-05-30T21:39:29+05:30 IST