ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైవర్షన్‌ పాలిటిక్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైసీపీ

ABN, First Publish Date - 2022-01-29T05:36:12+05:30

వైసీపీ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తయారైందని టీడీపీ సీనియర్‌ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు

గుంటూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తయారైందని టీడీపీ సీనియర్‌ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల్ని పక్కదారి పట్టించడానికే వైసీపీ జిల్లాల విభజన పేరుతో రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. ఒక శాస్ర్తీయ పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జిల్లా కేంద్రాలను నిర్ణయించారని మండిపడ్డారు. జిల్లాలకు పేర్లు పెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టటం దుర్మార్గమన్నారు. జిల్లా కేంద్రం సెంటర్‌గా ఉండాలని చెప్తున్న వైసీపీ పెద్దలు రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం కొత్త జిల్లాల మౌలిక వసతుల కల్పనకు నిధులు ఏవిధంగా సమకూరుస్తారని ప్రశ్నించారు. ఒక్కో కొత్త జిల్లా ఏర్పాటుకు దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయాలని జీవీ ఆంజనేయులు అన్నారు. 

Updated Date - 2022-01-29T05:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising