ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయం పెంపే దశలవారీ నిషేధమా?

ABN, First Publish Date - 2022-01-20T05:44:05+05:30

టార్గెట్లు పెట్టి మద్యం ఆదాయం పెంచుకోవడమే దశలవారీ మద్యపాన నిషేధమా.. అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్రయాలు పెంచుకునేందుకు గంట పొడిగింపు  

ప్రభుత్వ మద్యం పాలసీపై జీవీ ఆంజనేయులు ఆగ్రహం

గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): టార్గెట్లు పెట్టి మద్యం ఆదాయం పెంచుకోవడమే దశలవారీ మద్యపాన నిషేధమా.. అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగించి కరోనా వ్యాప్తికి ప్రభుత్వం దారి చూపిందన్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం దారుణమన్నారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై నియంత్రణ విధిస్తుంటే రాష్ట్రంలో మాత్రం  మరింతగా అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని విమర్శించారు. అవినీత, అజ్ఞానం, అహంకారం కలిస్తే సీఎం జగన్‌ అని మరోసారి రుజవైందని తెలిపారు. ధరలు పెంచితే మద్యం మానేస్తారని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడేందుకు ధరలు తగ్గించిందని నిలదీశారు. ప్రజల ఆరోగాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మద్యం విక్రయాల సమయం పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-20T05:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising