AP News: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారుతుంది ..సీఎం జగన్
ABN, First Publish Date - 2022-09-05T22:29:04+05:30
Amravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) అధ్యక్షత ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయం కూడా వస్తుంది. కొప్పర్తిలో పరిశ్రమ వైయస్సార్జిల్లా కొప్పర్తిలో రూ. 386.23 కోట్లతో కాసిస్ ఇ–మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. తొలివిడ
Amravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) అధ్యక్షత ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయం కూడా వస్తుంది.
కొప్పర్తిలో పరిశ్రమ
వైయస్సార్జిల్లా కొప్పర్తిలో రూ. 386.23 కోట్లతో కాసిస్ ఇ–మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. తొలివిడతలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Updated Date - 2022-09-05T22:29:04+05:30 IST