ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

ABN, First Publish Date - 2022-10-04T06:12:19+05:30

పట్టణ పరిధిలో ఓగేరు వాగులో సోమవారం ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన జరిగింది.

కార్తీక్‌, మోహన సాయి హనీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలకలూరిపేట, అక్టోబరు 3: పట్టణ పరిధిలో ఓగేరు వాగులో సోమవారం ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన జరిగింది. స్థానిక బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన నూతలపాటి కార్తీక్‌(14), దాసరి బజారుకు చెందిన పి.మోహన సాయి హనీష్‌(13) స్నేహితులు. వారిద్దరు వేర్వేరు పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుతున్నారు. వీరిద్దరు కొంతసేపు సరదాగా క్రికెట్‌ ఆడుకొని అనంతరం ఓగేరు వాగులో ఈతకు దిగారు. పట్టు తప్పి వాగులో కొట్టుకు పోతుండగా కేకలు విన్న స్థానికులు హుటాహుటిన వారిద్దరిని వాగులో నుంచి బయటకు తీసుకు వచ్చారు. తొలుత స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-04T06:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising